ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్

  • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ
  • లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి
  • లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి అమ్ముతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏకనా స్టేడియం సమీపంలో నకిలీ టికెట్లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నో సౌత్ డీసీపీ అమిత్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన వారని తెలిపారు. "చాట్‌జీపీటీ, గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వీరు నకిలీ టికెట్లను సృష్టించి, క్రికెట్ అభిమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు" అని ఆయన వివరించారు. ఓ అభిమాని వద్ద నకిలీ టికెట్ గుర్తించిన తర్వాత ఈ ముఠా గుట్టు రట్టయినట్లు తెలిపారు.

IPL
IPL 2026
Lucknow Super Giants
LSG
Royal Challengers Bangalore
RCB
Fake IPL tickets
AI
Artificial Intelligence
Ekana Stadium

More Telugu News